
Visit Andhra Pradesh
వరల్డ్ టూరిజం డే -2022 వేడుకలను క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్దిలో భాగంగా విజిట్ ఆంధ్రప్రదేశ్- 2023 క్యాంపెయిన్ను సీఎం ప్రారంభించారు. అనంతరం క్యాంపెయిన్ బ్రోచర్ల ఆవిష్కరించారు.
రాష్ట్రంలో సులువుగా పర్యాటక ప్రదేశాలను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన జీఐఎస్ వెబ్ పోర్టల్ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. పర్యాటక అభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తూ.. టూరిజం, ట్రావెల్, ఆతిథ్య రంగాల్లో రాష్ట్రం అత్యుత్తమ ప్రతిభ కనపరచాలన్నారు.
అరకు నుంచి వచ్చిన గిరిజన థింసా నృత్య కళాకారులతో సీఎం జగన్ కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.