
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ ముందుకొచ్చింది. దాదాపు రూ.1500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఒబెరాయ్ గ్రూప్ నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఒబెరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి రాజారామన్ శంకర్ భేటీ సమావేశమయ్యారు. ఈ మేరకు ఈ మేరకు ఏపీలో ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడి ప్రణాళికలను సీఎం జగన్కు వివరించారు.
పారిశ్రామిక, పర్యాటకంగా క్రమక్రమంగా విస్తరిస్తున్న ఏపీకి ఇది శుభపరిణామం అని చెప్పాలి. అన్ని హోటల్స్ కూడా విల్లాల మోడల్లో నిర్మించనున్నారు. విశాఖపట్నం, తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, హర్సిలీహిల్స్ లో హోటల్స్ ఏర్పాటుచేసేందుకు ఆసక్తి చూపించిన ఒబెరాయ్ గ్రూప్,.. పాడేరు పరిసర ప్రాంతాల్లో టూరిజం సెంటర్ నిర్వహించేందుకు కూడా తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించింది. ఏపీలో ఒబెరాయ్ ప్రాజెక్ట్లకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.