
minister botsa satyanarayana talks with teachers unions and discusses over key issues
ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. చాలా రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ఉప్యాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో స్పందించిన వైసీపీ ప్రభుత్వం.. సంఘాల నాయకులతో చర్చించాలని నిర్ణయించింది. అందులో భాగంగా గురువారం ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలను మంత్రి బొత్స వివరించారు. తమ దృష్టికి రాకుండా పెండింగ్లో ఉన్న అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. డీడీఓ అధికారం హెడ్ మాస్టర్లకు ఇస్తున్నట్టు తెలిపారు. జనరల్ ట్రాన్సఫర్లు, టీచర్ల ప్రమోషన్లపైనా చర్చించామన్నారు. రెండో ఎంఈఓ పోస్టులు 680 ఆమోదించడమే కాకుండా.. తాత్కాలికంగా ఏపీఎంలకు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు.
నాడు -నేడు ద్వారా కొత్త జూనియర్ కాలేజీల్లో అన్ని సదుపాయాలు కల్పించడం, ఇంటర్మీడియట్ బోర్డును ఒకే కమిషనరేట్లోకి తీసుకురావడంపై ప్రభుత్వం చర్చించినట్లు.. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. స్కూలు విద్యను పటిష్ఠం చేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయులు అలాగే జూనియర్ లెక్చరర్ల నియామకంపై త్వరలో నిర్ణయిస్తామని ఉపాధ్యాయులకు మంత్రి బొత్స స్పష్టం చేశారు.
బదిలీల అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు.. 24 గంటల్లో దీనికి సంబంధించి జీవో ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జీరో సర్వీసు బదిలీతో పాటు.. జీతాలు, ఇంక్రిమెంట్లను పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పిందన్నారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, నక్కా వెంకటేశ్వర్లు. ఫేస్ రికగ్నిషన్ ద్వారా వేధించడం సరికాదని.. బోధన మీదే ఏకాగ్రత పెట్టేలా చూడాలని ఉపాధ్యాయ నాయకులు మంత్రి బొత్సను కోరారు. అయితే ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోని నిర్ణయం తీసుకుంటుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.